DBN TELUGU CHANNAL:- 18 ఏళ్లపాటు ఆర్మీ జవాన్ గా దేశసేవ చేసి పదవీ విరమణతో ఇల్లు చేరిన రిటైర్డ్ జవాన్ కి గ్రామ ప్రజలు శాల్వతో ఘనంగా సన్మానించారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్ 2006 సంవత్సరంలో ఆర్మీ (కోర్ ఆఫ్ సిగ్నల్స్) లో జాయిన్ అయ్యి గోవా, రాజస్థాన్,పూణే, జమ్ము కాశ్మీర్,అమృతసర్, మణిపూర్, ఢిల్లీ మొదలగు ప్రదేశాల్లో Cipher CHM హోదాలో 18 సంవత్సరాలు ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహించాడు. దేశ సేవ చేసి పదవీవిరమణ పొంది ఆదివారం స్వగ్రామం చంద్రపల్లికి వచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్రం తిరుపతి,పెండ్యాల వెంకటేష్,సాలిగామ సంతోష్, బోయిని రాజేష్, కొడిమల శ్రీకాంత్, కొండు శ్రీధర్, ధర్మయ్య, శ్రీనివాస్, ఉదయ్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి రాజు కుమార్, సాయి, సాయి కుమార్, కొమిరెల్లి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.