DBN TELUGU CHANNAL:- రెబ్బెన మండలంలో గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్ నగర్ కి చెందిన దాగం సోమయ్య, పార్వతి దంపతుల కుమారుడు రాజ్ కుమార్.. ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
రాజ్ కుమార్ ఇరిగేషన్ ఏఈఈగా ఎంపికయ్యారు. ఇప్పటికే దాగం రాజ్ కుమార్ పోలీసు కానిస్టేబుల్ పోలీసు కానిస్టేబుల్ (సివిల్)గా 2020లో ఎంపికై ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్స్ లో స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన చెల్లెలు మానస వాంకిడి మండలంలో వ్యవసాయశాఖలో ఏఈవో విధులు నిర్వర్తిస్తు న్నారు. ఇద్దరు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏఈఈగా ఎంపికైనట్లు తెలిపారు.