DBN TELUGU CHANNAL:-మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల (టీజీఎస్ డబ్ల్యూఆర్ డీసీ)లో శుక్రవారం రాత్రి విద్యార్థిని విద్యుత్ షాక్ కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కళాశాలకు చెందిన వైష్ణవి ల్యాప్టాప్ చార్జింగ్ పెట్టేందుకు ఇన్వర్టర్ ప్లగ్ తీసి పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ కు గురికావడంతో సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం బయటకు పోక్కకుండా అధ్యాపకులు జాగ్రత్త పడినట్లు చికిత్స పొందుతున్న వైష్ణని తెలుస్తోంది. విద్యార్థిని పరిస్థితి నిలకడగానే ఉందని ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ లో సంప్రదించగా అందుబాటులో లేకుండా పోయారు.