DBN TELUGU CHANNEL:- మందమర్రి మండలంలోని మారుమూల గ్రామం అయినటువంటి మామిడిగట్టు గ్రామానికి రామకృష్ణాపూర్ SI రాజశేఖర్ వచ్చి U.P.S పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ నోట్ బుక్స్ మరియు పెన్నుల పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ....విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని, ఎవరు కూడా చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు... అని ప్రతి ఒక్క విద్యార్థి పరిశుభ్రంగా ఉండాలని పాఠశాల ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు.... తల్లిదండ్రులను మరియు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.