DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగను కరీంనగర్ లోని నగునూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సమత ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
కొత్త బోనాల మట్టి కుండలలో నైవేద్యాన్ని వండి బోనాలు తయారు చేసి సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సమత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సుస్మ, అధ్యాపకులతో విద్యార్థినిలతో కలిసి ఊరేగింపు తో వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండుగల్లో ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.