DBN TELUGU CHANNAL:- మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాల రేషన్ బియ్యం ను పట్టుకున్నారు.
కన్నెపల్లి నుంచి ఆటో ట్రాలీలో మంచిర్యాలకు తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. కన్నెపల్లిలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటో ట్రాలీని పరిశీలించగా బియ్యం లభించిందన్నారు. శ్రీనివాస్ ఆటోలో బియ్యాన్ని మంచిర్యాల లోని రాజుకి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.