Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: చిరుత దాడిలో ఆవు మృతి.

DBN TELUGU CHANNEL:- అదిలాబాద్ జిల్లాలో చిరుత పులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.






వివరాలు చూసుకుంటే... బోథ్ మండలంలో చిరుత పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పార్టీ (బి) గ్రామానికి చెందిన రైతు తొడసం సీతారాం కు చెందిన ఆవు గురువారం చింతల బోరి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లగా, చిరుత పులిదాడి చేసి చంపివేసింది. దీంతో బాధిత రైతుకు నష్టపరిహారం అందేవిధంగా అటవీశాఖ అధికారులు చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆవు కళేబరాన్ని అడవి సిబ్బంది పరిశీలించారు. పులిని కనుక్కోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.