Type Here to Get Search Results !

ఐటీడీఏ అధికారులకు స్థానచలనం.

DBN TELUGU:-  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) లో పని చేస్తున్న పలువురు ఉన్నతాధికారులు స్థానచలనం పొందారు.





వారి స్థానంలో కొత్త అధికారులు నియమితుల య్యారు. ఐటీడీఏలో ఏపీవో జనరల్ గా పని చేస్తున్న భీంరావు, పరిపాలనాధికారి(ఏవో)గా విధులు నిర్వహిస్తున్న రాంబాబులు ఏటూరునాగారానికి బదిలీ అయ్యారు. గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిగా పని చేస్తున్న గంగాధర్ హైదరాబాద్లోని గురుకుల ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఇక్కడి నుంచి స్థానచలనం పొందిన వారిస్థా నంలో ఏటూరు నాగారం ఏపీవో జనరల్ జాధవ్ వసంత్, ఏవో దామోదర్స్వామి ఉట్నూరు ఐటీడీఏకు బదిలీపై వచ్చారు. హైదరాబాద్లోని గురుకుల ఆర్సీవో రాజ్యలక్ష్మి ఇక్కడికి బదిలీ అయ్యారు. భద్రాచలం ఐటీడీఏలో గణాంక అధికారిగా పనిచేస్తున్న సురేష్ బదిలీపై ఇక్కడికి వచ్చారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.