Type Here to Get Search Results !

పాఠశాలలకు స్థలాలు కేటాయించండి: కాంగ్రెస్ నాయకులు.

డిబియన్ తెలుగు ఛానల్:- మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల, మరియు జూనియర్ కాలేజీలకు, ఐబి సమీపంలో సులబ్ కాంప్లెక్స్ లకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్వాజి మహేందర్ రావు, గట్టు మురళీధర్ రావు, సూరం రవీందర్ రెడ్డి, పేరం శ్రీనివాస్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఆయన నివాసంలో వినతి పత్రం అందజేశామని తెలిపారు.





వారు మాట్లాడుతూ... మండలంలో జూనియర్ కళాశాల గతంలో మంజూరైనప్పటికీ అది కో ఎడ్యుకేషన్ కాకుండా బాలికల జూనియర్ కళాశాల మంజూరు అయిందని అది క్యాన్సల్ చేసి మరలా కో ఎడ్యుకేషన్ మంజూరు చేయాలని, అలాగే మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలకు వెంటనే స్థలం కేటాయించాలని గతంలో పలుమార్లు పాఠశాల సిబ్బంది స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన కేటాయించలేదని అన్నారు. మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని పిల్లలు చదువుకునే పాఠశాల లకు త్వరగా స్థలాలు కేటాయించాలని, అద్దె భవనాల్లో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేవని, తాండూర్ ఐబి చౌరస్తాలో సులబ్ కాంప్లెక్స్ లేక ప్రయాణికులు స్థానిక వ్యాపారస్తులు వివిధ గ్రామాల నుండి బుధవారం, శనివారం సంతకు వచ్చేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. అసెంబ్లీ సెషన్స్ అయిపోగానే వస్తానని సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.