Type Here to Get Search Results !

Breaking News: గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్ట్...!

డిబిఎన్ తెలుగు న్యూస్:- గత కొంత కాలంగా చెడుఅలవాట్లకు, జల్సలకి అలవాటు పడిన యువకులు అదే క్రమములో గంజాయి త్రాగడానికి డబ్బు కోసం గంజాయి అమ్మితే వచ్చే లాభం తో మళ్ళి, మళ్లి గంజాయి కొనుక్కోవచ్చని, గత సంవత్సరం నుండి వారు ముగ్గురు కలిసి మహారాష్టలోని బల్లర్శ, చంద్రపూర్ రైల్వే స్టేషన్ లలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుక్కువచ్చి బెల్లంపల్లి లో నివాసం ఉండే గంజాయి అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు అమ్ముతూ సులువుగా అక్రమ మార్గములో డబ్బులు సంపాదిస్తూన్నారు.






అదే విధంగా గత 15 రోజుల క్రితం బండి సూర్య తేజ, తండ్రి: రాం మూర్తి, వయసు: 18 సంవత్సరాలు, కులం :పద్మశాలి, వృత్తి: స్టూడెంట్ నివాసం: బాబు క్యాంపు బస్తి, బెల్లంపల్లి మరియు అతని స్నేహితులైన బెల్లంపల్లి కి చెందినా ఇద్దరు మైనర్ బాలురు కలిసి మహారాష్టలోని బల్లర్శ నందు గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి ½ కిలో (500 grams) రూపాయలు 7,500/- లకు కొని అట్టి గంజాయిని బెల్లoపల్లి లోని గంజాయి త్రాగే వారికి ఎక్కువ రేటుకు అమ్మగా 300 గ్రాములు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినారు. మిగతా 200 గ్రామూల గంజాయిని నిన్న అనగా తేది:25.07.2024 నాడు మద్యాహ్నం అమ్మగా 3.00 గంటల ప్రాంతంలో కన్నాలబస్టి లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర అమ్మడం కోసం ముగ్గురు కలిసి ఉండగా అదే సమయములో పోలీస్ వారికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అక్కడకు వెళ్ళగా వారు పోలీస్ వారి వాహనాన్ని చూసి పారిపోవుటకు ప్రయత్నిచగ పోలీస్ వారు ని పట్టుకున్నారు. తదుపరి పోలీస్ వారు అట్టి గంజాయిని, వారి మొబైల్ ఫోన్స్ స్వాదినపరచుకొని అట్టి ముగ్గురిని అరెస్ట్ చేసినారు. ఇందుమూలంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ నిషేదిత గంజాయిని అమ్మిన, కొన్న సేవించిన మరియు రవాణా చేసిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని, వారిని జైలుకు పంపడం జరుగుతుంది మరియు వారి పైన షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ మరియు పీ.యస్. బెల్లంపల్లి 1 టౌన్ S.H.O దేవయ్య హెచ్చరించారు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.