Type Here to Get Search Results !

యాప్ లో హాజరు నమోదు చేయాలి: డీఈవో.

డిబిఎన్ తెలుగు న్యూస్:- ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్లు పాఠశాలలో నమోదైన ప్రతీ విద్యార్థి వివరాలు ఎస్ఆర్ఎస్ మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసి, తప్పనిసరిగా హాజరు వేయాలని డీఈవో ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు.






ఎస్ఆర్ఎస్ఈలో విద్యార్థుల హాజరు ప్రతీరోజు నమోదు చేయాలని, దీన్ని అత్యంత ప్రధాన్య అంశంగా పాటించాలని సూచించారు. ఎస్ఆర్ఎస్ హాజరు నమోదు చేయని పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎం లు, ఎమ్మార్సీ సిబ్బంది సహకారంతో ప్రతీరోజు అన్ని పాఠశాలల్లో ఎస్ఆర్ఎస్ హాజరు వందశాతం నమోదయ్యేలా పర్య వేక్షించాలని సూచించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.