డిబిఎన్ తెలుగు న్యూస్:- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్ గ్రూపుల్లో ఖాళీల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోనల్ అధికారి అరుణాకుమారి తెలిపారు.
ఈ నెల 26న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లక్సెట్టిపేట, 28న గురుకుల విద్యాలయ బాలుర సీ ఈవో బెల్లంపల్లిలో స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 9గంటలకు అడ్మిషన్ సెంటర్కు హాజరు కావాలని తెలిపారు. 2024లో ఒకే ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.2 లక్ష లు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50లక్షలు మించకుండా ఉండాలని తెలిపారు.