DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో 24/7 ప్రత్యేక కంట్రో ల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందులో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులను కేటాయించి నట్లు పేర్కొన్నారు. ఉదయం 6నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు కాశీరాం, మహ్మద్ షఫీ, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు సయ్యద్ అనిజ్, ఎన్. అశోక్, రాత్రి 10నుంచి ఉదయం 6గంటల వరకు జీ సుభాష్, డీ లక్ష్మ ణ్ విధుల్లో ఉంటారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1800 4251939 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవ కాశమున్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు అక్కడకు చేరు కుని సమస్య పరిష్కరిస్తారని పేర్కొన్నారు.