DBN TELUGU:- ఆదిలాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ టీపీవో జీ అనురాధ భైంసాకు బదిలీ కాగా... ఆమె స్థానంలో భైంసా టీపీవో సుమలత ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆదిలాబాద్ టీపీఎస్ సాయికిరణ్ నిర్మల్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో నిర్మల్ టీపీఎస్ నవీన్ కుమార్ ఇక్కడకు బదిలీ అయ్యారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సూపర్వైజర్ పని చేస్తున్న ఎండీ సాజిద్ అలీ ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కాగా, బోధన్ మున్సిపల్ నుంచి ఆదిలాబాద్కు శానిటరీ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చిన బీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.