Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. హఠాన్మరణం...!

DBN TELUGU:- ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు.





చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. ఈ రోజు హైదరాబాద్కు తీసుకొస్తుండగా మార్గమధ్యలోని ఇచ్చోడలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలను శాసించిన వ్యక్తిగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పేరుగాంచారు. టిడిపి నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ పార్టీ నుండి ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ గా అనేక పదవులను చేపట్టిన రాథోడ్ రమేష్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.