DBN TELUGU:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయపరంగా ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.బ్రేకింగ్ న్యూస్: డి ఎస్ ఇక లేరు...!
June 28, 2024
0
Tags