Type Here to Get Search Results !

మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానంకల్పి స్తున్నామని ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.





రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లు రద్దు చేయడం ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్ల కాలేదు అన్నారు.రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత మాది. మైనారిటీ స్కూళ్లకు భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది అని రేవంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.