Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట...!

DBN TELUGU:- భారత దేశంలోనే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు.





ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టుకు శనివారం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేలు బాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. ఇదే కేసులో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ.. ఒక్కసారి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించడంలేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో.. విచారణకు హాజరు కాగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.