Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఆదిలాబాద్ జిల్లా లో పర్యటించునున్న అస్సోం సీఎం.

DBN TELUGU:- తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధిక సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ర‌చించింది. రాష్ట్రంలో బీజేపీ పెద్ద‌ల ప‌ర్య‌టన‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.





ఈ నేప‌థ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ విజ‌య సంకల్ప‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో... భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో శ్రేణులను ఏకధాటిపై తేవడం కోసం, పార్టీ విధివిధానాలను, తమ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ఇవ్వాళ బాసర పుణ్యక్షేత్రం నుండి ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క యాత్ర అదిలాబాద్, పెద్దపెల్లి, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలను అనుసంధానిస్తూ 21 శాసనసభ స్థానాల్లో సుమారు 310 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అస్సాం సీఎంతో పాటు, ఇతర బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.