DBN TELUGU:-
- జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాయి భోజన్.
- ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, రోగులకు అన్నదానం.
- భారత మహిళ సరోజినీ నాయుడు స్మరణలో కార్యక్రమం.
- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.
జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, భారతదేశ తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సరోజినీ నాయుడు స్మరణలో భారత మహిళగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సాధించిన సరోజినీ నాయుడు స్మరణలో అన్నదానం చేయడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్- రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ గార్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు దుర్గం మారుతి సేవకులు ఇగురపు భాస్కర్ ,ఏనుగు హేమలత , షేక్ పర్వీన్, సయ్యద్ షాహిన్ , సయ్యద్ అభిబ్ఉన్నిసా, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు, తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.



