Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: జెఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన సిఒఈ విద్యార్థులు.

DBN TELUGU:- 


- జెఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన సిఒఈ బెల్లంపల్లి.


- ఉత్తమ పర్సెంటెయిల్ సాధించిన 8 మంది విద్యార్ధులు. 


- అభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి. 


- విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ ఐనాల సైదులు.







నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) మంగళవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ), బెల్లంపల్లి విద్యార్ధులు సత్తా చాటారు. 8 మంది విద్యార్ధులు ప్రతిభ కనబరిచి ఉత్తమ పర్సెంటెయిల్ సాధించిననట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. వీరిలో దుర్గం చరణ్ తేజ్ 85.04 పర్సెంటైల్ తో కళాశాల టాప్ గా నిలువగా తరువాతి స్థానాల్లో వరుసగా తీగల ఆశ్రిత్-(83.64), దుర్గం అఖిరనందన్-(75.50), లింగంపల్లి అంజి-(63.39), ఆకుతోట శివసాయి-(58.17), కామెర విష్ణుచైతన్య-(55.16), పుట్టల శివ-(54.92), కొందుకూరి దిలీప్-(50.11) విద్యార్ధులు తరువాతి స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వీరితో పాటు మరో 5 మంది ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించే అవకాశం ఉందని తెలిపారు. 



                              జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచడమే కాకుండ ఎక్కువ మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించే అవకాశం ఉండటం అభినందనీయమని ఆదిలాబాద్ రీజియన్ ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఫోన్ ద్వారా విద్యార్ధులను, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులను అభినందించారు.   


                                ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనవరి 27 నుండి 31 వరకు జరిగిన జెఈఈ మెయిన్స్-2024 మొదటి సెషన్ కు కళాశాల నుండి 39 మంది హాజరయ్యారు. ఏప్రిల్ లో 2వ సెషన్ జరుగుతుందని ఈ రెండింటిలో ఉత్తమ ఫలితాన్ని తీసుకొని కటాఫ్ పర్సెంటైల్ తో అడ్వాన్స్డ్ కు అర్హత ఇస్తారు. వీరికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి లలో అడ్మీషన్స్ ఇస్తారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు విద్యార్ధులకు పుష్పగుచ్చాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఓఈ సూపరింటిండెంట్ అవదూత రాజశేఖర్ వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, అధ్యాపకులు నాగినేని శ్రీరామవర్మ, మిట్టా రమేష్, చందా లక్ష్మీనారాయణ, కట్ల రవీందర్, ముద్దసాని శోభ సిబ్బంది సమేందర్, తేజశ్వి, రాజశేఖర్, ఐ.మల్లేష్ లు పాల్గొన్నారు.   


 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.