Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: కట్నం కోసం అత్తమామలపై కాల్పులు.

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని కన్నె పెళ్లి మండలంలో అదనపు కట్నం ఇవ్వాలంటూ అత్తమామలపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

 

                                      మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో మండలంలోని సాలింగం గ్రామంలో గోమాస నరేందర్ అనే యువకుడు తన స్నేహితులతో కలసి అదనపు కట్నం కోసం తన ( సాలిగామ గ్రామానికి చెందిన గోరేటి శంకర్ లక్ష్మీ లపై) అత్తమామలపై కాల్పులు జరిగాడు. ఈ సంఘటనలో అత్తమామలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొన్ని నెలల నుంచి అత్త మామ, అల్లుడి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గోమాస నరేంద్ర తన భార్యను కొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించారు. అంతటితో ఆగకుండా ఆస్తి కోసం గొడవ చేయడానికి కరీంనగర్ నుంచి గోమాస్ నరేందర్ తన స్నేహితుడు మహేష్ తో అత్తింటికి వచ్చాడు. అదనపు కట్నం కోసం అత్తమామలతో గొడవకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టోల్ తో నేలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్తి కోసం అత్త మామల పై కాల్పులు జరిపిన నిందితుడు నరేందర్ కు తుపాకీ ఎక్కడదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.