DBN TELUGU:-
- మనస్థాపంతో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి.
- విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్.
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం.
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న టేకం శివకుమార్ అనే విద్యార్థి ఈరోజు పరీక్ష కేంద్రమైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో తన మొదటి పరీక్షను రాయాల్సి ఉండగా నిమిషం ఆలస్యం అయిన కారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాల సిబ్బంది లోనికి రానివ్వని కారణంగా విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురై ఈ రోజు సూసైడ్ నోట్ రాసి మరి సాత్నాల ప్రాజెక్టులో పడి చనిపోవడం జరిగింది. వెంటనే ఈ యొక్క సంఘటనపై ప్రభుత్వం స్పందించి నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దని ఏదైతే నిబంధన ఉందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని అలాగే విద్యార్థి కుటుంబానికి తగు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్, AIFDS జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్ కుమార్, TAGS రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్, ASU జిల్లా కార్యదర్శి మరసకుల అశోక్, TSF జిల్లా నాయకులు సత్యనారాయణ, PDSU జిల్లా అధ్యక్షులు సిడం సాయికుమార్, SVA జిల్లా అధ్యక్షులు గొప్లే సుజయ్, తదితరులు పాల్గొన్నారు.

