DBN TELUGU:- భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్మరాజుల శ్రీదేవి కి టికెట్ రావడంతో కాసిపేట మండలంలో సంబరాలు నిర్వహించిన బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్.
ఈ సందర్భంగా... సూరం సంపత్ ఆధ్వర్యంలో దేవాపూర్, ముత్యంపెళ్లి గ్రామాలలో టపాకాయలు పేర్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ మహిళలకు టికెట్లు కేటాయించడంలో అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అలాగే భారత కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సమచితస్థానం కల్పించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవునురి సంతోష్, మండల ఉపాధ్యక్షులు భాకి నరేష్, రెడ్డి బాలరాజు, ఏదుల తిరుపతి, పెద్దపల్లి శంకర్, మండల కార్యదర్శి లు రామచందర్ ,సదయ్య , కిరణ్ బాకీ సురేష్,కిషన్ మోర్చా అధ్యక్షులు పోలవేని పొశం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు దుర్గం దుర్గయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ యూసఫ్, ఉదయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.