DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణం లోని 25వ వార్డ్ లో 5 లక్షల CSR నిధులతో నూతన సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్లంపల్లి పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ సుజాత, రాములు నాయక్, ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, నాయకులు శ్రీధర్, గంగాధర్, రాజం మరియు ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.