DBN TELUGU:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో
గణపతి నవరాత్రుల సందర్భంగా పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజచేసి, నైవేద్యం పెట్టి, అన్నదానం కార్యక్రమం చేసి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని గణపతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సోమని రాజం, భూనేని రాజు, లవుడం శ్రీనివాస్, ఎల్లయ్య, యూత్ చెండె నవీన్, సోమని గణేష్, రంజిత్, రాజేందర్, మల్లేష్, మహేష్, వంశి, కార్తిక్, రాకేష్ లు పాల్గొన్నారు.