DBN TELUGU:- బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామానికి చెందిన 40 మంది యువకులు బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
వీరికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి తాము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. అలాగే రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గెలుపే లక్ష్యంగా తాము పని చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.