DBN TELUGU:-
- డిగ్రీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ లో భాగం కండి.
- జాతీయ సేవా పథకంలో చేరండి.
- జాతి సేవలో పాలు పంచుకోండి.
- ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కాంపల్లి శంకర్ ఎంఏ రేష్మ పిలుపు.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) లో భాగం కావాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ పిలుపునిచ్చారు. సోమవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1, యూనిట్-2 విభాగాల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎం.ఏ. రేష్మ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవం (ఎన్ఎస్ఎస్ డే) నిర్వహించారు. జాతీయ సేవా పథకం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
-- విద్యార్థులకు సేవా భాగ్యం.
జాతీయ సేవా పథకంలో చేరడం ద్వారా విద్యార్థులకు సమాజానికి సేవ చేసే భాగ్యం లభిస్తుందని ప్రిన్సిపాల్ గోపాల్ తెలిపారు. ఎన్ఎస్ఎస్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దాదాపు 800ల పైచిలుకు విద్యార్థుల సంఖ్య గల బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 అనే రెండు విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతి సేవలో భాగం కావాలని సూచించారు.
-- విద్యార్థులతో మమేకమవుతూ: ప్రిన్సిపాల్.
జాతీయ సేవా పథకంలో భాగంగా విద్యార్థులతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 కోఆర్డినేటర్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఎన్ఎస్ఎస్ లో చేరాలనుకునే విద్యార్థులు తమను సంప్రదించాలని ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం గోపాల్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి శ్రీలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.