Type Here to Get Search Results !

ఎంబిబిఎస్ విద్యార్థికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం.

DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని కన్నెపల్లి మండలానికి చెందిన గొల్లపల్లి యోగేశ్వర్ అనే యువకుడు పేదరికం నుంచి వచ్చి కష్టపడి చదివి ఇంటర్మీడియట్ లో 912 మార్కులు సాధించే అలాగే 2023లో నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ద్వారా రామగుండం లోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజిలో ఎంబిబిఎస్ సీట్లు సాధించాడు.





అతనిది పేద కుటుంబం కావడంతో ఎంబిబిఎస్ చదివే అంతా ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎవరైనా దాతలు సహాయం చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో, ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(ఆక్ట్) వెనుకబడిన పేద ప్రజల పిల్లల చదువును ప్రోత్సహించాలనే సదుద్దేశంతో యోగేశ్వర్ కి 10000 వేల రూపాయలు చెక్ రూపంలో ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... పేదలకు, అనాధలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మరియు చదువుకునే వాళ్ళను ప్రోత్సహించడంలో, సేవా కార్యక్రమాలు చేయడంలో మా సంస్థ ముందుగానే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎస్.మహేందర్, ఉపాధ్యక్షుడు కె.తిరుపతి, ప్రచార కార్యదర్శి బి.భూమేష్, అసిస్టెంట్ సెక్రటరీ జె.శ్రీనివాస్, సభ్యులు కె సంపత్ మరియు అశోక్ పాల్గొన్నారు.

                

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.