Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఘోర రోడ్డు ప్రమాదం.

DBN TELUGU:- కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.





వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం ఉదయం ఆర్టిసి బస్సు లారీ డీ కొట్టుకోవడంతో నలుగురికి తీవ్ర గాయలైన ఘటన  చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో నిజామాబాద్ కు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు తాడికల్ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిలంచారు. విషయం తెలుసుకున్న కేశవపట్నం ఎస్.ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకు వివరాలను సేకరిస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.