Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: బీజేపీ కి బిగ్ షాక్ తప్పదా...?

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుండే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.






ఇదిలా ఉండగా... నల్గొండ జిల్లాలోని మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరిన అనంతరం మునుగోడు లో నిర్వహించిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా గెలిచి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదుగుదామనుకున్నారు. కానీ... నిర్వహించిన ఉప ఎన్నికలలో అధికార బీజర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో రాజగోపాల్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటివరకు భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు...? పార్టీ పెద్దలపై అలిగారా...? లేక కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ఏమైనా మంతనాలు జరుపుతున్నారా...? అసలు రాజగోపాల్ రెడ్డి మౌనం వెనక మర్మమేంటి...? అనే అంశంపై మునుగోడు నియోజకవర్గ ప్రజల్లో తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. సొంత గూటిలోకి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు ఇటీవల తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణలో వస్తాయని, ఈ సారి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అనుచరులు సైతం గట్టిగా నమ్ముతుండడంతో రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే... మనం మరిన్ని రోజులు చూడాల్సిందే...!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.