DBN TELUGU:- ఫోన్ పోయిందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం జగద్గిరిగుట్ట ఎల్లమ్మ బండలో కెటిఆర్ కాలనీలో నివాసముంటున్న నితీష్ రాజు(26) అనే యువకుడు యూస్ చేస్తున్న మొబైల్ ఫోన్ పోవడంతో మనస్థాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.