DBN TELUGU:- అరిజిన్ డైరీ పేరుతో రైతుల వద్ద నుండి డబ్బులను వసూలు చేసి, బర్రెలను ఇప్పిస్తామని రైతులను మోసం చేసిన అరిజిన్ డైరీ డైరెక్టర్ కందిమల్ల ఆదినారాయణ ను పోలీసులు అరెస్టు చేశారు.
బెల్లంపల్లి పట్టణంలోని పోలీసులు ఆయన కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు విషయాల ఆయనపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదినారాయణన పై పోలీసులు పిడీ యాక్ట్ కేసు నమోదు చేసి... సంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ఆదినారాయణ కుటుంబ సభ్యులకు బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ ఫోన్ చేసి సమాచారం అందించారు.