DBN TELUGU:- తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లిలో 6వ తరగతి చదువుచున్న నిచ్చకోల రుషికేష్ అత్యంత ప్రతిష్టాత్మకమైన అగాఖాన్ అకాడమీ 4దశలుగా నిర్వహించిన ప్రతిభా పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి ఇంటర్వ్యూకు ఎంపికయినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.
అగాఖాన్ అకాడమీ ప్రతిభా పాఠవాలను పలుదశల్లో గుర్తించి ఎంపిక చేసిన విద్యార్ధులకు పూర్తిస్థాయిలో ఉచిత నాన్యమైన విద్యను అందజేస్తుంది. దీనికోసం పాఠశాల స్థాయి, రీజియన్ స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలకు రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా ముఖా ముఖీ పరీక్షను నిర్వహిస్తుంది. అత్యంత క్లిష్టమైన ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయికి సిఓఈ నుండి ఐదుగురు విద్యార్ధులు ఎంపికయ్యారు. వారీలో రుషికేష్ ఆన్లైన్ ఇంటర్యూకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీఓ కొప్పుల స్వరూప రాణి విద్యార్ధిని ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య రుషికేష్ ను మెంటర్స్ గా వ్యవహరించిన దాసం అజిత, వై.హారికలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, ఉపాధ్యాయులు శాతరాజు తిరుపతి, పొన్నం శ్రీనివాస్, స్రవంతి, కాసర్ల రాజేందర్, సభియా బాను తదితరులు పాల్గొన్నారు.