బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాతరి స్వామి, రొడ్డ శారద, ముడిమడుగుల మహేందర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న స్థానికులకు కాకుండా వలసవాదికి టికెట్ ఇస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, ప్రజలకు సేవ చేస్తున్న స్థానికులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు, పార్టీకి ఏనాడూ అందుబాటులో లేని గడ్డం వినోద్ కు టికెట్ ఆశించే అర్హత లేదని స్పష్టం చేశారు. చిరకాలంగా రాజకీయ ఆకాంక్షలతో పనిచేస్తున్న స్థానిక లీడర్లకే రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పునరుద్ఘాటించారు. స్థానిక లీడర్లు ఎవరికి టికెట్ వచ్చిన వారు గెలుపు కోసం ఐక్యంగా అందరం పనిచేస్తామని తెలిపారు. వలసవాది గడ్డం వినోద్ కు టికెట్ ఇస్తే మాత్రం బెల్లంపల్లిలో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకుడు బండి ప్రభాకర్, జిల్లా కార్యదర్శిలు గెల్లి జయరాం, సిరివెరి సత్యనారాయణ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్: రానున్న ఎన్నికలలో వలసవాదికి టికెట్ ఇస్తే తరిమికొడుతాం...!
September 26, 2023
0
DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో స్థానికులను కాదని, వలసవాదికి టికెట్ ఇస్తే తరిమికాడుతామని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న పలువురు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags