Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు హల్చల్...!

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన చోటుచేసుకుంది.





వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ కు చెందిన షఫీ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసుకొని ఊరికి వెళ్ళాడు. అతను ఇంట్లో నుండి బయటకి వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారం, 12 తులాల వెండి, పదిహేను వేల వరకు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బెల్లంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా... ఎస్సై మాట్లాడుతూ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.