Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: గణనాధుల నిమజ్జనానికి సర్వం సిద్ధం...!

DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణంలో గణనాధుల నిమజ్జనోత్సవానికి పోచమ్మ చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పంతాటి సదయ్య కలిసి పరిశీలించారు.





ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిమజ్జనం సమయంలో ఎటువంటి ఆవంచనీయ సంఘటనలో జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం వేడుకలు జరిగే విధంగా చూడాలని అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని తెలిపారు. పోచమ్మ చెరువు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఇరువైపులా రోడ్డు చదును చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ట్రెచీ టి. శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య దగ్గరుండి నిమజ్జోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.