DBN TELUGU:- బెల్లంపల్లి నియోజక వర్గంలో కాసిపేట మండల కేంద్రంలో ఇటీవల బిజెపి ఉపాధక్షులు బాకీ నరేష్ తండ్రి లింగయ్య పరమపదించగా విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్ణ వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, రైస్ బ్యాగు అందించడం జరిగింది.
అలాగే అనంతరం దేవపుర్ గ్రామానికి చెందిన యువకుడు గణేష్ నిన్న అనారోగ్యంతో మంచిర్యాల ప్రెయివేట్ హాస్పిటల్లో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసి వారి తల్లిదండ్రులను పరామర్శించి, గణేష్ మృతికి గల కారణాలు వైద్య సిబ్బందితో మరియు ఆరోగ్య అధికారులతో మాట్లాడి గణేష్ కుటుంబానికి తగు న్యాయం జరిగేలా చూస్తాను అని హామీ ఇవ్వండి జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్, బిజెపి అసెంబ్లి కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రేవెల్లి రాజలింగు, మండల నాయకులు రెడ్డి బాలరాజు, పెద్దపెల్లి శంకర్ , దోమల రామచందర్, చొప్పదండి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.