DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ) లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
- ప్రజల బాధలను తనవిగా చేకొన్న ప్రజాకవి కాళోజీ: సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.
తెలంగాణ సమాజంలో నలిగిపోతున్న నాటి ప్రజల బాధలను తన తదునైన శైలితో తెలంగాణ యాసలో అక్షరసేద్యంచేస్తూ లక్షల మెదళ్ళను ఆలోచింపజేసి కదిలించిన పదునైన సిరాచుక్కగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన సిరా చుక్క కాళోజీ అని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ), బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అన్నారు. శనివారం కాళోజీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి సిఓఈ లో తెలుగు డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..... పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలక్షేమం కోసం జీవితాంతం కృషిచేసిన తెలగాణ తొలిపొద్దు కాళోజీ అన్నారు. ప్రజల భాదలను అర్ధంచేసుకొని అన్యాలను ఎదురిస్తూ చివరికంటా ప్రజల పక్షాన నిలబడిన ధీరోదాత్తుని సేవలను నేడు తెలంగాణ సమాజం గుర్తించడం గర్వకారణమన్నారు. విద్యార్ధులు ఆయన కార్యదిక్షతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాళోజీ చిత్రపఠానికి ఉపాధ్యాయులు ,విద్యార్ధులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.