- ప్రజలు మరోసారి నన్నే గెలిపిస్తారు...!
- అభివృద్ధి చేసినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం...!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే రేఖ నాయక్ కు రానున్న ఎన్నికలలో రేఖ నాయక్ ను కాదని మరో వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని ఏఆర్ఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎస్టీ మహిళ అనే ఉద్దేశంతో తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని, తొమ్మిదేళ్లుగా ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రానున్న ఎన్నికలలో తాను తప్పకుండా ఎమ్మెల్యే పోటీలో ఉంటానని ఖానాపూర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను పర్యటించి ప్రజలు మద్దతును కూడగట్టుకుంటానని పేర్కొన్నారు. అదేవిధంగా జన్నారం మండల పరిధిలని రోటిగూడ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి తెలిపారు. టీ.జీ పల్లె నుంచి కామన్ పల్లి గ్రామం వరకు 2.25లక్షల వ్యయంతో 3 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రామ్ తండా నుంచి సోనాపూర్, లక్ష్మీదేవి టెంపుల్ నుంచి చింతగూడ గ్రామ పంచాయతీ రోడ్డు వరకు హాస్టల్ తండా నుంచి నాయకపుగుడా వరకు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని ఏఆర్ఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎస్టీ మహిళ అనే ఉద్దేశంతో తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని, తొమ్మిదేళ్లుగా ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రానున్న ఎన్నికలలో తాను తప్పకుండా ఎమ్మెల్యే పోటీలో ఉంటానని ఖానాపూర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను పర్యటించి ప్రజలు మద్దతును కూడగట్టుకుంటానని పేర్కొన్నారు. అదేవిధంగా జన్నారం మండల పరిధిలని రోటిగూడ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి తెలిపారు. టీ.జీ పల్లె నుంచి కామన్ పల్లి గ్రామం వరకు 2.25లక్షల వ్యయంతో 3 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రామ్ తండా నుంచి సోనాపూర్, లక్ష్మీదేవి టెంపుల్ నుంచి చింతగూడ గ్రామ పంచాయతీ రోడ్డు వరకు హాస్టల్ తండా నుంచి నాయకపుగుడా వరకు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.