DBN TELUGU:- గిరిజన హక్కుల సాధన లక్ష్యం సేవలాల్ సేన పనిచేస్తుందని సేవాలాల్ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గూగులొత్ మల్లేష్ నాయక్ ఉన్నారు. కాసిపేట మండలంలోని లంబాడి తండా (డి) గ్రామపంచాయతీలో సేవాలాల్ సేన 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లేష్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర సర్పంచుల సంగం నాయకులు అజ్మీర తిరుపతి నాయక్ మాట్లాడుతూ... 10 శాతం రిజర్వేషన్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 500 మంది జనాభా గల తండాలను గ్రామపంచాయతీ చేయడంలో సేవాలాల్ సేన ప్రత్యేక భూమిక పోషించిందని తెలిపారు. అలాగే పోడు భూముల పట్టాలు ఇవ్వడంలో కూడా సేవాలాల్ సేన ఘనత అని తెలిపారు. అలాగే తండా గ్రామపంచాయతీని ప్రత్యేక రెవిన్యూ గ్రామపంచాయతీ గుర్తించాలని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ నాయక్ యూత్ సభ్యులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.