DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఉన్న పాటీ, కుష్ణపల్లి, చిత్తపూర్, పోట్యల, చిన్న వెంకటాపూర్, జిల్లేడ , బుయ్యారం, వేమనపల్లి గ్రామాల్లో నెల కొన్న పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు లక్ష్మి అధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఐటీడీఏ పీఓ ఆదేశాలు జారీ చేస్తే జిల్లా కలెక్టర్, జిల్లా కలెక్టర్ ని కలిస్తే ఐటీడీఏ పీవో లను కలవాలని అటు ఇటూ తిరిగి తిరిగి అలిసి పోయామని రైతులను ఫుట్ బాల్ ఆడుతున్నారని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. గిరిజనులకు న్యాయంగా దక్కాల్సిన పోడు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం నెన్నెల ఎంపిడిఓ వరలక్ష్మి తో ఫోన్ లో మాట్లాడారు, ఎఫ్.ఆర్ వో లు, ఎం.ఆర్.వో లు ఫోన్ లిఫ్ట్ చేయలేదని వెంటనే వీరి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బండి శంకర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.