Type Here to Get Search Results !

విజయభేరీ సభను సక్సెస్ చేయాలి:టీపీసీసీ చీఫ్.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 17వ తేదీన సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభ ఉంటుందని ఈ సభకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు.



ఆదివారం నాడు గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ (Zoom meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ఈ నెల 11 నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. 119 శాసనసభ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలి. రాష్ట్రంలోని 35వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు తరలివచ్చేలా చూడాలి. రేపు పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్ ప్రెసిడెంట్స్‌తో సమావేశం నిర్వహిస్తాం. ఆ నేతలు ఈనెల 12,13,14 మూడు రోజుల పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలి. 17వ తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీ హామీలను విడుదల చేస్తారు. 18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారు.18వ తేదీన వారితో కలిసి 5గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లను అతికించాలి. ఇంటింటికీ గ్యారంటీ కార్డులను అందజేయాలి. కార్యకర్తలతో భోజనాలు చేయాలి. ఆ తర్వాత సమావేశాలు నిర్వహించి 5 గ్యారంటీ హామీలను వివరించాలి.18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతీ ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలి అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.