DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.
వివరాల్లోకి వెళితే... కన్నేపల్లి మండలంలోని జన్కపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇప్ప బాపు, 7వ వార్డ్ సభ్యులు గంధం బాపు మరియు ఇప్ప మల్లేష్, ఇప్ప నగేష్, రాజిరెడ్డి గారు, ప్రమీల గారు, పోసక్క, రాజేష్, ప్రదీప్ ఇతర పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు, తదితరులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తాము బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీటీసీ కర్రీ లతశ్రీ-శంకర్, రైతు సమన్వయ కమిటీ శ్రీరామరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, నియోజకవర్గ బిఆర్ఎస్వై ఉపాధ్యక్షులు ఉదయ్, కన్నేపల్లి మండల యువజన అధ్యక్షులు ప్రశాంత్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కాళ్ళ సురేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.