Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో... ఉద్యోగిని మృతి...!

DBN TELUGU:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. 



వివరాల్లోకి వెళితే... వాంకిడి మండలంలోని ఎంపీపీఎస్ నార్లపూర్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అడికే మంజుల శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వాంకిడి మండలంలోని బుందేల్ ఘాట్ బ్రిడ్జి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. మృతి చెందిన ఉపాధ్యాయురాలుది మంచిర్యాల జిల్లా. వారి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరణానికి చింతిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తోటి ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదమునకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.