Type Here to Get Search Results !

కలెక్టర్ చేతుల మీదగా 5 వేల నగదు బహుమతి పొందిన సిఓఈ విద్యార్ధులు.

DBN TELUGU:- భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో ఓటు చైతన్యంపై సాంస్కృతిక పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించారు.





ఈ పోటీల్లో ఇంగ్లీష్ లో అత్యంత ప్రతిభావంతంగా 6 నిమిషాల నిడివిగల స్కిట్ ను ప్రదర్శించి ఔరా అనిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ, బెల్లంపల్లి విద్యార్ధులు. అంతేకాకుండా 5వేల రూపాయల నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఐఏయస్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఐఏయస్ లనుండి అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రిన్సిపాల్ ఐనాల సౌదులు తో కలిసి వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, ఉపాధ్యాయులు ఆర్.రామారావు, సజ్జనపు విజయ్, మిట్ట రమేష్, నాగిని శ్రీరామ వర్మ తదితరులు పాల్గొన్నారు.  



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.