DBN TELUGU:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ప్రగతి భవన్ లో సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ యువకుడు డోంగ్రే సంతోష్(స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి) సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో శనివారం ప్రగతి భవన్ లో కేటీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న అభివృద్ధి పనులను, పున్య వివాహాలు, నిత్య అన్నదానం అలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకే టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 2019 ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, అప్పటి నుండి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రానున్న ఎన్నికలలో ఎమ్మేల్యే కోనేరు కోనప్ప గెలిచే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.