Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- ఎక్స్‌ప్రెస్‌ రైల్లో లో అగ్ని ప్రమాదం.

DBN TELUGU:- దేశంలో చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిషా రైలు యాక్సిడెంట్, తెలంగాణలో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలను పూర్తిగా మరువక ముందే.. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 



వివరాల్లోకి వెళితే... శనివారం తెల్లవారుజూమున మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేశారు. సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ట్రైన్ ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.