Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:-ఆస్తి విషయంలో అన్న పై పెట్రోల్ తో దాడి చేసిన తమ్ముడు.

DBN TELUGU:- ఆస్తి విషయంలో అన్నదమ్ములకు గొడవ కావడంతో అన్న పై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలోని అప్పాజీపల్లిలో చోటు చేసుకుంది. 



వివరాల్లోకి వెళితే.... కొల్చారం గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి శంకరయ్యకు ముగ్గురు కుమారులు ప్రవీణ్ , ప్రశాంత్, అశోక్‌లు ఉన్నారు. ప్రశాంత్‌ను గ్రామంలోని చింతల రాములు ఇంటికి ఇల్లరికం పంపారు. ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తన అన్న ప్రవీణ్, తమ్ముడు అశోక్‌లతో గొడవ పడుతున్నాడు. తనకు ఆస్తిలో వాటా కావాలని తరచూ గొడవలు జరుగుతున్నాయి. శంకరయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు ఆస్తిలో వాటా పంచుకోవాలని తెలిపింది. వాటా ఇవ్వకపోతే అన్న ప్రవీణ్‌ను చంపుతానని చెప్పడంతో తల్లి మాటలు విని ప్రశాంత్ అందరూ నిద్రించిన తర్వాత పెట్రోల్ తీసుకువచ్చి ప్రవీణ్ పై పోసి తగలబెట్టాడు. దీంతో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గ్రామస్తులు ప్రవీణ్ ను మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ 90% శాతం వరకు శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా... క్షతగాత్రుని భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.