Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- సరదా కోసం వెళ్లి... ప్రాణాలు విడిచిన యువకులు...!

DBN TELUGU:- యువకుల సరదా ప్రాణం మీదికి తెచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి కొంతమంది యువకులు సరదాగా ఎస్సారెస్పీ గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శించి మెండోరా శివారులోని కాకతీయ కాలువ వద్ద కలిసి భోజనం చేశారు.


 అంతలోనే సరదా కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతూ గల్లంతయ్యారు. వివరాలలోకి వెళ్తే… నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పుట్ట వేణు (22) , ప్రాణవ్ రావ్ (19) లు మరొక స్నేహితునితో కలిసి పోచంపాడు సందర్శనకు వెళ్లారు. అనంతరం మెండోరా గ్రామంలోని మరొక స్నేహితుని వద్దకు వెళ్లి కలిసి భోజనం చేసినట్టు సమాచారం. అనంతరం ఈత సరదా కోసం కాలువలోకి దిగిన వేణు నీట ములుగుతున్నడని గమనించిన ప్రణవ్ రక్షించే ప్రయత్నంలో కాలువలు దిగాడు. కాకతీయ కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోయారు. దీంతో స్నేహితుల కోసం ఒడ్డున ఉన్న వారు వేసిన కేకలు విన్న కొంతమంది గొర్రెల కాపరులు వారిని రక్షించే ప్రయత్నం కూడా చేసినారు. అయితే వేణు ప్రణవ్ లు నీటమురిగే అదృశ్యం కావడంతో చేసేదేమీ లేక అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నీటి విడుదలను ఆపివేసి గజహితగాలతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం కావడంతో చీకటి పడి వెతికే ప్రయత్నాన్ని ఆపివేశారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా గల్లంతైన యువకుల కోసం విలపించడం స్థానికులను కలిచివేసింది. ఈ సందర్భంగా మృతదేహాల కోసం శనివారం ఉదయం తాసిల్దార్ సతీష్ రెడ్డి, స్థానిక ఎస్సై శ్రీనివాస్ యాదవ్ గజ ఈతగాళ్ళు తో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.